ఒకవైపు కథానాయికగా నటిస్తూనే, అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్తో అలరిస్తున్న భామ తమన్నా. ప్రస్తుతం చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున తదితర అగ్ర కథానాయకుల సరసన నటించే హీరోయిన్స్ జాబితాలో తమన్నా పేరు అందరి కంటే ముందుంటుంది. వెంకటేశ్, వరుణ్తేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘ఎఫ్3’లో మెహ్రీన్తో పాటు, తమన్నా హీరోయిన్గా చేస్తోంది. కాగా, ఇప్పుడు చిరంజీవి జోడీగా ఆమె ఎంపిక దాదాపు ఖరారైంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరు నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. కీర్తిసురేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక కోసం తమన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో నటించినందుకు గానూ ఆమె కెరీర్లో భారీ పారితోషికం అందుకుంటున్నారని టాలీవుడ్ టాక్. ‘భోళా శంకర్’ కోసం ఆమె దాదాపు రూ.3కోట్లు అందుకోనున్నారట. అంతేకాదు, సగం మొత్తం అడ్వాన్స్గా తీసుకున్నారని సమాచారం. ఇది నిజమో కాదో తెలియాలంటే తమన్నానే స్పందించాల్సి ఉంది. ఇక చిరు-తమన్నా కలిసి ‘సైరా’లో నటించారు. తెరపై వీరి జోడికి మంచి మార్కులే పడ్డాయి.
చిరంజీవి సినిమా కోసం ₹3కోట్లు
Related tags :