Business

వినియోగదారులపై జియో బ్రహ్మాస్త్రం

వినియోగదారులపై జియో బ్రహ్మాస్త్రం

మొబైల్‌ వినియోగదారులకు మరో షాక్‌. 20 శాతం మేర ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రముఖ టెలికాం కంపెనీ జియో ప్రకటించింది. పెంచిన ఛార్జీలు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇటీవల ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు జియో కూడా నడిచింది. జియో ఫోన్‌ కోసం అందుబాటులో ఉన్న ప్రాథమిక ప్లాన్‌కు రూ.75 బదులు ఇకపై రూ.91 చెల్లించాల్సి ఉంటుంది. రూ.199 ప్లాన్‌ (28 రోజులకు 1.5జీబీ/రోజుకు) ధరను రూ.239కు పెంచింది. అలాగే, రూ.444 ప్లాన్‌కు రూ.533, రూ.555 ప్లాన్‌కు రూ.666 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.