టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ సొంత గూటికి రాబోతున్నారు. కారు దిగి ‘చేయి’ పట్టుకోబోతున్నారు. ఆయన కాంగ్రెస్లో చేరేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈనెల 24న అధినేత సోనియాగాంధీ సమక్షంలో డీఎస్ కాంగ్రెస్లో చేరనున్నారు. గత కొంతకాలంగా శ్రీనివాస్, టీఆర్ఎస్లో ఇమడలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది రాజకీయంగా డీఎస్ ఎదుగుదలంతా కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికార పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. అయితే కొంత కాలానికే సీఎం కేసీఆర్కు, ఆయనకు మధ్య దూరం పెరిగిపోయింది. రేవంత్రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే డీఎస్ కాంగ్రెస్లో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల రేవంత్రెడ్డి, కుసుమ్కుమార్ డీఎస్ ఇంటికి వెళ్లి డీఎస్ను పరామర్శించారు. అప్పుడే ఆయన కాంగ్రెస్లో చేరేందుకు బీజం పడిందని చెబుతున్నారు. రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు కాగానే డీఎస్ పెద్ద కుమారుడు సంజయ్ వెళ్లి ఆయనను కలవడం, ఆ తర్వాత సంజయ్ కాంగ్రెస్లో చేరారు.