DailyDose

ఏపీ మంత్రి పై హైదరాబాద్ లో కేసు నమోదు!

ఏపీ మంత్రి పై హైదరాబాద్ లో కేసు నమోదు!

ఆంధ్రప్రదేశ్ మంత్రి అనిల్ కుమార్‌పై తెలంగాణలో పోలీసు కేసు నమోదయినట్లుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో పెన్నా కాల్వకు చెందిన టెండర్ల విషయంలో జరిగిన గోల్‌మాల్ వ్యవహారం హైదరాబాద్‌లో జరిగింది. ఆ టెండర్లను ఖరారు చేసేముందు రివర్స్ టెండర్లకు వెళ్లారు. అయితే అందులో ఎవరూ పాల్గొనవద్దని మంత్రి అనిల్ కుమార్ బాబాయ్ , నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ బెదిరించినట్లుగా కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ఈ బెదిరింపులకు పాల్పడటంతో కాంట్రాక్టర్ ్ఫిర్యాదు మేరకు డిసెంబర్ 24వ తేదీన 506, 504 ఐపీసీ సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫోను, వాట్సప్‌ కాల్స్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను నెల్లూరు టీడీపీ నేతలు మీడియాకు విడుదల చేశారు. ఈ కేసు విషయంలో మంత్రి అనిల్ బాబాయ్.. రూప్‌కుమార్‌కు, మరో వ్యక్తికి నోటీసులు ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన వివరాల్లో మరొక ఫోన్‌ నంబరు ఉందని, అది మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌దని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ కేసులో త్వరలో ఆయనకు పోలీసులు నోటీసులు ఇస్తారని అంటున్నారు. అయితే ఇప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని కాంట్రాక్టర్‌తో రూప్ కుమార్ బేరసారాలకు దిగుతున్నారని నెల్లూరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ కేసు రాజీ పడిపోతారో లేకపోతే.. పొరుగు రాష్ట్రంలో మంత్రి అనిల్‌పై కేసు నమోదవుతుందో చూడాలి. నెల్లూరు రాజకీయాల్లో ఈ కేసు మాత్రం కలకలం రేపుతోంది.