Politics

గురు రవిదాస్ ఆలయంలో.. . ప్రధాని మోదీ చెక్క భజన.. ..

గురు రవిదాస్ ఆలయంలో.. . ప్రధాని మోదీ చెక్క భజన.. ..

వారణాసిలోని సంత్ రవిదాస్ జన్మస్థలంలో ఉన్న మందిరం సుందరీకరణ, విస్తరణ పనుల గురించి మీడియా కథనాలను మోదీ ఓ ట్వీట్‌లో జత చేశారు. కాశీ (వారణాసి) నుంచి తాను లోక్‌సభ సభ్యునిగా గెలిచినప్పటి నుంచి తన ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ గురు రవిదాస్ స్ఫూర్తిని ఏ విధంగా ఆచరిస్తున్నదీ వివరించారు. అదేవిధంగా తాను ఢిల్లీలోని శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిరంలో షబద్ కీర్తన్‌లో భక్తులతో కలిసి పాల్గొన్నట్లు ఓ వీడియోను జత చేశారు. ఈ క్షణాలు చాలా ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. గురు రవిదాస్ 15వ శతాబ్దానికి చెందినవారు. ఆయన అనుచరులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ముఖ్యంగా దళితులు ఆయన బోధనలను అనుసరిస్తారు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌లలో ఆయన భక్తులు చాలా మంది ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల నేపథ్యంలోనే పంజాబ్ శాసన సభ ఎన్నికలను ఈ నెల 14 నుంచి ఈ నెల 20కి వాయిదా వేశారు. మోదీ మంగళవారం మాట్లాడుతూ, సంత్ రవిదాస్ దురాచారాలను తొలగించడానికి, కులతత్వాన్ని, అంటరానితనాన్ని నిర్మూలించడానికి కృషి చేశారన్నారు.

m2
m3