DailyDose

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 27 వేల కేసులు నమోదవగా, తాజాగా అవి 30 వేలకు పెరిగాయి. నిన్నటికంటే ఇవి 11 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.దేశంలో కొత్తగా 30,615 కరోనా కేసులు నమోదవగా, 514 మంది మరణించారు. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,27,23,558కి, మరణాలు 5,09,872కి చేరాయి. మొత్తం బాధితుల్లో 4,18,43,446 మంది కోలుకోగా, 3,70,240 మంది చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో 82,988 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.రోజువారీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉందని, 173.86 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.