సూర్య కథానాయకుడిగా బాల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రాన్ని సూర్య తన సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కించనున్నారు. ఇందులో కథానాయికగా కృతిశెట్టిని ఎంచుకున్నట్టు సమాచారం. ‘ఉప్పెన’తో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు కృతి. తొలి చిత్రమే సంచలన విజయం సాధించడంతో కృతి బిజీ హీరోయిన్ అయిపోయారు. ఆమె నటించిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ బాక్సాఫీసు దగ్గర మెరిశాయి. దాంతో తనకు మరింత డిమాండ్ ఏర్పడింది. టాలీవుడ్లో బిజీగా ఉన్న కథానాయికల్లో కృతి పేరు తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఆమెకు కోలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చింది. సూర్య – బాల కాంబో అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ సినిమాతో రాణిస్తే, తమిళ నాట కూడా కృతి బిజీ హీరోయిన్ అయిపోవడం ఖాయం.