NRI-NRT

పారిస్​ చేరుకున్న మోదీ.. ప్రవాస భారతీయుల ఘన స్వాగతం

పారిస్​ చేరుకున్న మోదీ.. ప్రవాస భారతీయుల ఘన స్వాగతం

మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్​ రాజధాని పారిస్​​కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్​ మెక్రాన్​తో భేటీ కానున్నారు. ఐరోపా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఫ్రాన్స్​ రాజధాని పారిస్​​కు చేరుకున్నారు. ఫ్రాన్స్​ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్​ మెక్రాన్​తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. రెండు దేశాలు సన్నిహిత సహకారంతో పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు.
భారతదేశ బలమైన భాగస్వాములలో ఫ్రాన్స్ ఒకటి అని.. ఇరు దేశాలు విభిన్న రంగాలలో సహకరించుకుంటున్నాయని మోదీ ట్విట్టర్‌లో తెలిపారు. పారిస్​ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ప్రధానిగా ఎన్నికైన అనంతరం నరేంద్ర మోదీకి ఇది ఐదో ఫ్రాన్స్​ పర్యటన. అంతకుముందు ఏప్రిల్ 2015, నవంబర్ 2015, జూన్ 2017, ఆగస్టు 2019 పర్యటించారు. ఫ్రాన్స్​ అధ్యక్షుడు మెక్రాన్ మార్చి 2018లో భారత్​ను సందర్శించారు.