Devotional

జూలై 11 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు

జూలై  11 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై ఏటా నిర్వహించే ఆషాఢ మాసోత్సవాలు ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. వచ్చేనెల 28వ తేదీ వరకూ జరుగుతాయి. ఈ నెల రోజులూ భక్తులు అమ్మవారికి సారె సమర్పించవచ్చు. కాగా, జూలై 11 నుంచి 13వ తేదీ వరకూ శాకంబరీదేవి ఉత్సవాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మూడు రోజులూ అమ్మవారు ఆకుకూరలు, కూరగాయల అలంకారంతో దర్శనమిస్తారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఈవో భ్రమరాంబ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఏర్పాట్లపై సోమవారం ఆమె ఆలయ వైదిక కమిటీ సభ్యులు, వివిధ సెక్షన్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ, వైదిక కమిటీ సభ్యులు, దేవస్థానం అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, సహాయ ఇంజనీర్లు, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.