NRI-NRT

కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఉగ్రరూపం.. ఎమర్జెన్సీ విధింపు

కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఉగ్రరూపం.. ఎమర్జెన్సీ విధింపు

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు చెలరేగింది. మరిపోసా కౌంటీలో పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. యోస్‌మైట్‌ నేషనల్‌ పార్కు సమీపంలో ప్రారంభమైన కార్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అక్కడి 2,600 నివాసాలు, వ్యాపార సంస్థల్లోని 6 వేల మందిని వేరే చోటుకు తరలించారు. 400 మంది ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. కౌంటీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.