NRI-NRT

విక్టోరియా రాష్ట్ర ఎన్నారై టీడీపీ సెల్ నూతన సభ్యుల నియామకం

విక్టోరియా రాష్ట్ర ఎన్నారై టీడీపీ సెల్ నూతన సభ్యుల నియామకం

ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రానికి టీడీపీ ఎన్నారై సెల్ నూతన కమిటి జాబితాని తెలుగుదేశం పార్టీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో దేవేంద్ర పర్వతనేని, ధరణేష్ యడ్లపల్లి, పరశురామ్ పాలడుగు, రామకృష్ణ ప్రసాద్ అన్నే, ప్రతిమ యడ్లపల్లి సభ్యులుగా ఉన్నారు. తమను పార్టీ సభ్యులుగా నియమించినందుకు వారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చంనాయుడులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచినందుకు ధన్యదాదాలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసేందుకు ఎన్నారైలుగా తమ వంతు కృషి చేస్తామని వారు అన్నారు.

08122022173228n79