Politics

వాషింగ్టన్ డి.సి లో దసరా ఉత్సవాలను ప్రారంభించిన మేడసాని మోహన్

వాషింగ్టన్ డి.సి లో దసరా ఉత్సవాలను ప్రారంభించిన మేడసాని మోహన్

వాషింగ్టన్ డిసిలో తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షతన నిర్మాణంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో మేడసాని మోహన్ దసరా ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేడసాని మాట్లాడుతూ మహాభారతంలోని అనేక సంఘటనలు ప్రస్తుత సమాజానికి వర్తిస్తాయి. కృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు తదితర పాత్రల ద్వారా అనేక అంశాలు మనకి భోదపడతాయన్నారు. దుర్యోధనుడు, శకుని, కీచకుడు లాంటి పాత్రలు నేటిసమాజంలో కూడా కనిపిస్తున్నాయన్నారు. మాయా జూదం, ఎత్తులు పై ఎత్తులు, పగ ప్రతీకారం, అహం లాంటివాటితో అధికారం, సంపద కోల్పోయారు. ఆధ్యాత్మికత అంటే మతం కాదు. అదో గొప్ప నాగరికత అది సంఘ జీవన హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం. భారత దేశ సంస్కృతి, నాగరికత అతి ప్రాచీనమైనవని ఆయన అన్నారు.

మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ అష్టావధానంలోని మాధుర్యాన్ని మేడసాని ప్రపంచానికి చాటి చెప్పారు. తెలుగులో అష్టావధాన కళను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అవధాన ప్రక్రియతో సాహితిక్రతు నిర్వహించారు.

సతీష్ వేమన మాట్లాడుతూ మేడసాని చేసిన ప్రసంగం పసివారు సైతం శ్రద్దగా విన్నారు. ఎక్కడా విసుగు, విరామం లేకుండా కొన్ని గంటలపాటు ఆయన ప్రసంగించగలరు. అష్టావధానంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన సాంగత్యంలో ఈ పవిత్రమైన ప్రదేశంలో మేము పాల్గొనటం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతీ పద్యానికి తాత్పర్యం చెప్పటం ద్వారా ప్రేక్షకులు రసజ్ఞతతో ఆస్వాదించారు.

అనంతరం రావిపాటి జనార్దన్ దంపతులు, సతీష్ వేమన, మన్నవ సుబ్బారావు మేడసాని మోహన్ ను ఘనంగా సత్కరించారు.