NRI-NRT

అమెరికాలో ఘోరం. ముగ్గురు తెలుగు విద్యార్థులు మృతి. మరో ఐదుగురికి గాయాలు.

అమెరికాలో ఘోరం ముగ్గురు తెలుగు విద్యార్థులు మృతి మరో ఐదుగురికి గాయాలు

అమెరికాలోని బోస్టన్ నగరం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఎనిమిది మంది తెలుగు విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీకొట్టింది ఈ సంఘటనలో ముగ్గురు తెలుగు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఐదుగురు విద్యార్థులు గాయాలపాలై స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వీరిలో కొందరు పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు సమాచారం మృతదేహాలను తెలుగు రాష్ట్రాలకు తరలించడానికి గాయపడినవారి కి చికిత్స అందించడానికి తానా టీమ్ స్పేర్ రంగంలోకి దిగింది

మెసాచుసెట్స్ రాష్ట్రంలోని షెఫీల్డ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు విద్యార్థులు మరణించారు. వారు హైదరాబాద్ కి చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి కి చెందిన సాయి నరసింహ మరియు వరంగల్ కి చెందిన పావని గుళ్ళపల్లి అని ప్రాధమిక సమాచారం.

అలాగే మరో అయిదుగురికి గాయాలవడంతో బెర్కషైర్ ఆసుపత్రికి తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం అక్టోబర్ 25 మంగళవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రెండు వెహికిల్స్ లోని డ్రైవర్స్ గాయాల పాలయ్యారు.

తాను నేతలు కొల్లా అశోక్ ప్రవీణ్ గడ్డం యోగేష్ విశ్వనాధ్ నాయన పాటి తదితరులు విద్యార్థుల మృతదేహాలను తరలించడానికి గాయపడిన వారికి చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు

029

030

031

033
034