NRI-NRT

TPAD ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

TPAD ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్(టీపాడ్) ఆధ్వర్యంలో తాజాగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతం అయింది. టీపాడ్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో బ్లడ్ డొనేషన్ చేయడానికి పలువురు ఆసక్తి చూపారు. రోజు మొత్తం సాగిన ఈ కార్యక్రమంలో దాదాపు 69 మంది దాతలు రక్తాన్ని దానం చేశారు. 69 మంది నుంచి సుమారు 52 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్టు టీపాడ్ ఓ ప్రకటనలో తెలిపింది. 52 యూనిట్ల రక్తాన్ని Carter blood care‌కు అందించినట్టు వెల్లడించింది. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన ఈ రక్తంతో సుమారు156 మంది ప్రాణాలు రక్షించొచ్చని తెలిపింది.
Untitled-3-744aded1ac
అంతేకాకుండా.. దాదాపు 10 మందికి హార్ట్ సర్జరీలు చేయడానికి లేదా 17 మందికి రక్త మార్పిడి చేయడానికి ఈ 52 యూనిట్ల రక్తం సరిపోతుందని చెప్పింది. దాతల కోసం లంచ్, బ్రేక్‌ఫాస్ట్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. అంతేకాకుండా దాతలు చేసిన గొప్ప పనికి అభినందిస్తూ బ్లాంకెట్లను బహుమతిగా అందించినట్టు వెల్లడించింది. రక్తదాన శిభిరం విజయవంతం కావడానికి సహకరించిన రఘువీర బండారు, ఉమా బండారు‌తోపాటు వలంటీర్లకు Carter blood care‌ టెక్నీషియన్లకు ఈ సందర్భంగా టీపాడ్ ధన్యవాదాలు తెలిపింది. గాయత్రి గిరి, చక్రీ నారా, అజయ్ రెడ్డి(ఎఫ్‌సీ చైర్), రమణ లష్కర్(ప్రెసిడెంట్), ఇంద్రాని పంచెరుపుల(బీఓటీ), పాండు పాల్వే(కోఆర్డినేటర్) తదితర సభ్యులు అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వెల్లడించింది.