DailyDose

దుబాయిలో.. ధూమ్ దాం గా సంక్రాంతి సంబరాలు

దుబాయిలో..  ధూమ్ దాం గా సంక్రాంతి సంబరాలు

దుబాయిలో పూర్తి ఆచార వ్యవహారాలతో గోదాదేవి, శ్రీరంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని కూడ ఆధ్యాత్మికతతో సంక్రాంతి సంబురాలను నిర్వహించారు.

సంక్రాంతి అంటె స్వదేశాన కోడిపందేలపై ఆసక్తి విదేశాలలో సినిమా పాటల పై మోజు కానీ ధనుర్మాసంలో గోదాదేవి, శ్రీరంగనాథుల కళ్యాణ మహోత్సవం పై ఉండదు.

సంక్రాంతికి ఒక నెల ముందు సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలయి తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్ని సంక్రాంతి నెలగా విశ్వాసం. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు సాగే శ్రీఆండాళ్ లేదా గోదాదేవి అమ్మ వారి తిరుప్పావై పాశురాల పఠనం అనంతరం, గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది. ఈ రకమైన అథ్యాత్మికతతో సంక్రాంతి సంబురాలు చేసుకోనే వారి సంఖ్య తక్కువ.
null

ఈ నేపథ్యంలో దుబాయిలోని తెలుగు ప్రవాసీయులు ఆధ్యాత్మికతో ధార్మిక ఆచారాలతో, వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్ర్తోక్తంగా జరుపుకోన్న సంక్రాంతి పండుగ స్వదేశాన్ని కూడ అధిగమించింది. దుబాయిలోని తెలుగు అసోసియెషన్ మరియు రాస్ అల్ ఖైమాలోని తెలుగు తరంగిణి అనే తెలుగు ప్రవాసీ సంఘాల అధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలు మైథీలీ మోహన్ ప్రార్ధన గీతంతో ప్రారంభమై తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో జరిగాయి.
null

భోగి మంటలు, తిరుప్పావై అనంతరం, సంప్రదాయం – దుబాయి పక్షాన పి. భరద్వాజ ఆచార్య నేతృత్వంలో హరీష్ ప్రభు, మోహన్ ల సహకారంతో నిర్వహించిన శ్రీ గోదా రంగనాధుల కళ్యాణ మహోత్సవం మరియు అర్చనలు ఆద్యంతం భక్తి పారవశ్యంతో కన్నుల పండుగగా కొనసాగాయి. కళ్యాణ మహోత్సవంలో ఇందిరా విజయలక్ష్మిల అన్నమయ్య కీర్తనలు, తన్మయి విద్యార్డుల కూచిపూడి నృత్యాలు, ఇస్కాన్ వారి భజనలు, చందామేళం అందరినీ ఆకట్టుకోంది. ఇస్కాన్ పక్షాన హెచ్.జి. జగత్ శక్తి, హెచ్.జి. మురళీచరన్ దాస్ లు సందేశాన్ని ఇచ్చారు.
null
శ్రీ గోదారంగనాధస్వాముల పల్లకి సేవలో భక్తులందరూ భక్తి పారవశ్యంతో పాల్గొన్న తీరు పల్నాడులోని కోటప్పకోండల ప్రభల తీరును మరిపించింది.

ఎడారి నాట బతుక వచ్చిన చోటా కొత్త అల్లుళ్ళ సందడులు, బావమరదళ్ల సరసాలు లేకున్నా భోగి మంటలు, పసందైన పిండి వంటలు, కొత్త బట్టల వయ్యారాలతో దుబాయి తెలుగు ప్రవాసీయులు సంక్రాంతికి వన్నెలు తీసుకోవచ్చారు.
null
వివిధ ఆచార వ్యవహారాలతో శ్రీమతి లక్ష్మినంద (రాజమండ్రి), తనుజా రాజేశ్ (తిరుపతి), శోభా సురేశ్ (వైజాగ్) మరియు మైథీలి మోహన్ (తిరుపతి)లు కార్యక్రమాన్ని అలరింపజేసారు. మహిళలు ముగ్గులు వేస్తుండగా రామదాసు కీర్తనలు,హరినామ సంకీర్తనలతో కాలికి గజ్జెకట్టి తంబుర మీటుతూ,తలపై అక్షయ పాత్రతో చేతిలో చిడతలతో హరిదాసులుగా కోనేటి దకసాయి నర్సింహా, మను ప్రగాడ మరియు మీసాల మెహర్ శాశంక్ ల పాత్రలు అందర్ని ఆకట్టుకొన్నాయి.
null
మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్, అంతర్జాతీయ ఆర్యవైశ్య సంఘం (WAM) కార్యనిర్వహక అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ లు కార్యక్రమం లో పాల్గొని భోగి పళ్ళు పోయించుకుతున్న చిన్నారులను ఆశీర్వదించి బహుమతులను అందించారు. బోగి పళ్ళను శివానందం, ప్రసాద్ లు ప్రత్యెకంగా భారతదేశం నుండి తెప్పించారు.
null
తెలుగు తరంగిణి అద్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేష్, ఉపాద్యక్షులు ముసునూరి సాయికృష్ణ మోహన్, కార్యదర్శులు రాజేష్ ఛామర్తి, సత్యానంద కోకా, సి.హెచ్. శ్రీనివాస్, వెంకీ నాయుడు, శివానంద్ తెలుగు అసోసియేషన్ అద్యక్షులు దినేష్ ఉగ్గిన, ప్రధాన కార్యదర్శి వివేకానంద బలుసా, మోహన కృష్ణ, విజయ్ భాస్కర్, శరత్చంద్ర యెల్చురి, పద్మలత నగేష్ కార్యక్రమాన్ని సమన్వయం చేసినట్లుగా నిర్వహకులు తెలిపారు.
null
తెలుగు సంస్కృతి, కళలకు తాము ఎల్లప్పుడు ప్రధమ ప్రాధాన్యత ఇస్తామని దుబాయి తెలుగు అసోసియెషన్ అధ్యక్షులు దినేష్ ఉగ్గిన తెలుగు తరంగిణి అధ్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేశ్ లు ఈ సందర్భంగా తెలిపారు.