Movies

విడాకుల రోజు ఇంకా గుర్తుంది.. ఆ చీకటిరోజు నుంచి కోలుకోలేదు.. సమంత సంచలన వ్యాఖ్యలు

విడాకుల రోజు ఇంకా గుర్తుంది.. ఆ చీకటిరోజు నుంచి కోలుకోలేదు.. సమంత సంచలన వ్యాఖ్యలు

సమంత, నాగచైతన్య విడాకుల ప్రకటన చేసి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తోంది. కానీ వీరి మధ్య ఏం జరిగిందో తెలియక సినీ ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. 2021 అక్టోబర్ లో విడాకుల ప్రకటన చేసిన తరువాత అటు నాగచైతన్య, ఇటు సమంత విడాకుల గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు. ఆ మధ్య ఓసారి ‘కాపీ విత్ కరణ్’ కార్యక్రమంలో కరణ్ జోహార్ ఈ విషయంపై అడగగా ‘పాస్ ..పాస్..’ అంటూ దాటవేసింది. అయితే తాజాగా విడాకులపై సమంత సంచలన కామెంట్స్ చేసింది. ఆ చీకటిరోజులు ఇంకా మరిపోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

సమంత లేటేస్టుగా నటించిన మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ గత ఫిబ్రవరి 17న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి ఏప్రిల్ 14న ‘శాకుంతలం’ మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా నిర్వహించిన ప్రమోషన్స్ లో సమంత పాల్గొన్నారు. కొందరు తన విడాకుల గురించి అడగగా షాకింగ్ విషయాలను తెలిపారు.

తాను విడాకులు తీసుకున్న బాధ నుంచి ఇంకా కోలుకోలేదన్నారు. ఇప్పటికీ వాటిని చీకటి రోజులుగానే భావిస్తున్నట్లు చెప్పారు. స్వతంత్ర భావాలు కలిగిన మహిళగా అందరూ నన్ని అభివర్ణించారు. కానీ నేను ఎన్నో కష్టాలు పడి కన్నీళ్లను చూశానని ఆమె అన్నారు. క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు, స్నేహితులు నావెంటే ఉన్నరని అన్నారు. ఆ సమయంలో ఒక్కోసారి పిచ్చి ఆలోచనలు వచ్చేవి. కానీ ఆలోచనలకు పని చెప్పకుండా నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా అని అన్నారు.

ఇప్పటికీ విడాకుల ప్రకటన తేదీని మరిచిపోలేదని సమంత అన్నారు. ఆ బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉందన్నారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు బెటరనే ఫీలింగ్ లో ఉన్నానని అన్నారు. బాధలు, కష్టాలు వస్తూ పోతుంటాయని, వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. కానీ కొన్ని చీకటి రోజులు మాత్రం వెంటాడుతాయని, వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమంత హాట్ కామెంట్స్ చేశారు. సమంత చేసిన ఈ వ్యాఖ్యాలపై ఆమె ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారు.