Politics

గుడివాడ పర్యటనపై పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష

గుడివాడ పర్యటనపై పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష

ఈ నెల 12న మచిలీపట్నంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’

ఈ నెల 13న గుడివాడలో రోడ్ షో, సభ

ఈ నెల 14న గుడివాడలో అంబేద్కర్ జయంతి

నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభించనున్న చంద్రబాబు

గుంటూరు, : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. గుడివాడ, మచిలీపట్నంలో ఆయన రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, గుడివాడ పర్యటనపై పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, వెనిగండ్ల రాముతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ జయంతిని గుడివాడలో నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిమ్మకూరులో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 12న మచిలీపట్నంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రికి చంద్రబాబు నిమ్మకూరులో బస చేయనున్నారు. ఈ నెల 13న గుడివాడలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రికి చంద్రబాబు గుడివాడలోనే బస చేయనున్నారు. ఈ నెల 14న ఉదయం అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నారు.