ఈ నెల 24వ తేదీన మహారాష్ట్రలో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు.
భద్రతా కారణాల దృష్ట్యా అంఖాస్ మైదానంలో సభకు అనుమతి ఇవ్వలేమని ఔరంగాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి మరో ప్రదేశాన్ని ఎంచుకోవాలని సూచించారు.
ఔరంగాబాద్ పోలీసులపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు అదే రోజున వేరే ప్రదేశంలో బహిరంగ సభను నిర్వహించడానికి గులాబీ దళం సిద్ధమైంది.