Politics

25 కు 25 స్థానాలు వచ్చే అవకాశమే ఉంటే ఈ నిరసనలు ఎందుకు?

25 కు 25 స్థానాలు వచ్చే అవకాశమే ఉంటే ఈ నిరసనలు ఎందుకు?

తననెమో ఊరుకు రానివ్వరు… ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ని ఏ ఊరు తిరగనివ్వరా?

జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ కలిగి మాజీ ముఖ్యమంత్రిని సభలలో పాల్గొననివ్వరా?… ఇదా మన పరిపాలన??

యర్రగొండపాలెం ఘటనకు ముఖ్యమంత్రే కారణం… ప్రధాన ప్రతిపక్ష నేత మీటింగును అడ్డుకునేందుకు చొక్కా విప్పి నిరసన తెలియజేసిన మంత్రిని డిస్మిస్ చేయాలి

వైయస్ కుటుంబంలోకి షేక్ షమీం అనే కొత్త కోడలు వచ్చింది

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

టైమ్స్ నౌ తన సర్వే లో రాష్ట్రం లోని 25 ఎంపీ స్థానాలకుగాను తమ పార్టీ 26 స్థానాలలో గెలుస్తుందని చెబితే బాగోదని , 25 కు 25 స్థానాలలో గెలుస్తుందని చెప్పినట్టు ఉంది. 25 కు 25 స్థానాలలో గెలిచే అవకాశమే ఉంటే, ప్రధాన ప్రతిపక్ష నేత పాల్గొనే సభను అడ్డుకునేందుకు బట్టలిప్పుకొని నిరసనలు తెలియజేయడం ఎందుకనీ నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ఇమేజ్ బిల్డప్ కోసం టైమ్స్ నౌ కు 8.5 కోట్ల ప్యాకేజీ ఇచ్చిన మాట నిజం కాదా? అని నిలదీశారు. తననెమో తన ఊరుకు రానివ్వరు… ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని ఏ ఊరు తిరగనివ్వరు . యర్రగొండపాలెం లో
చంద్రబాబు నాయుడు పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు తెలియజేశారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడిని ఖండించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజన్న ఆయన, రాష్ట్రంలో గత నాలుగేళ్లు అనుదినము చీకటి దినమేనని పేర్కొ న్నారు . శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా లో రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వమని, ఇప్పటికే ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బ్రహ్మ, విష్ణువు , మహేశ్వరులు మాదిరి గా కలుస్తారా?, విష్ణువు, మహేశ్వరులు మాత్రమే కలుస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. బ్రహ్మ నేరుగా రాకుండా, మహేశ్వరుని ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంది. విష్ణుమూర్తి టిడిపి అనుకుంటే,
మహేశ్వరుడు జనసేన అని భావిస్తే, ఇక బ్రహ్మ బిజెపి అని ఆయన పేర్కొన్నారు. తన అంచనా ప్రకారం అయితే, త్రిమూర్తులు కలుస్తారని చెప్పారు.

దళితులకు ఎంతో మేలు చేసిన చంద్రబాబు

దళితుల అభ్యున్నతికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. గత రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు పర్యటనకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుండడంతో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్ర ఆందోళన చెందుతుంది. ఎలాగైనా ఆయన సభలను అడ్డుకోవాలని ఉద్దేశంతో, రాళ్ల దాడికి తెగబడ్డారు. చంద్రబాబు నాయుడు సభను అడ్డుకునేందుకు
మంత్రి ఆదిమూలపు సురేష్ తాను చొక్కా విప్పడమే కాకుండా, ఇతరులతో కూడా చొక్కా విప్పించి చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ, నిరసన తెలియజేయడం హస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు దళితులకు ఎందుకు క్షమాపణలు చెప్పాలి. దళితుల అభ్యున్నతికి కృషి చేసినందుకా?. తాను అధికారంలో ఉండగా దళితుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినందుకా?, ఎందుకు చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలో తెలియజేయాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు సభ పై దాడి చేయడమే కాకుండా, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టారని, అయినా అధికార పార్టీ క్యాడర్ సమయమనం పాటించిందని సాక్షి దినపత్రికలో రాయడం విడ్డూరంగా ఉంది. ప్రజలను ఏమైనా సాక్షి దినపత్రిక యాజమాన్యం పిచ్చివారని అనుకుంటున్నాదా ?, ప్రజలే అధికార పార్టీ నాయకులను పిచ్చి వారిని అనుకుంటున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా ను ఏమైనా తెలుగుదేశం పార్టీ వారు విప్పించారా?, ప్రకాశం జిల్లాలో ఎంతోమంది ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఉన్నప్పటికీ, దళిత నాయకుడిని ముందు పెట్టి దాడి చేయించడమే కాక, చంద్రబాబు నాయుడుని దళిత ద్రోహిగా చిత్రీకరించేందుకు తెర వెనుక నుంచి ముఖ్యమంత్రి రాజకీయం చేశారన్నారు. చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడి చేయగా, ఎన్ ఎస్ జి కమాండెంట్ సంతోష్ కుమార్ కు తలకు గాయమయ్యింది. మూడు కుట్లు కూడా పడ్డాయి. గన్నవరం సీఐ కి మాదిరి కాదు. నిజంగానే కుట్లు పడినప్పటికీ, వెంటనే విధుల్లో చేరి, చంద్రబాబుకు రక్షణగా నిలబడ్డారు. జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మీటింగులలో పాల్గొనకుండా అడ్డుకోవడం దారుణం. ఇదా మన పరిపాలన. ఈ సంఘటనకు ముఖ్యమంత్రి దే బాధ్యత. ముఖ్యమంత్రిది బాధ్యత కాక పోతే, చొక్కా విప్పి నిరసన తెలియజేసిన మంత్రిని బాధ్యున్ని చేస్తూ, వెంటనే మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయాలి. ఈ సంఘటనపై రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నదా, లేదా అన్నది విచారణ జరిపించాలి. ఈ ఘటనలో ముఖ్యమంత్రి పాత్ర ఉంటే, ఆయన తన పదవిలో కొనసాగడానికి అనర్హుడు. లేనిపక్షంలో, మంత్రి సురేష్ తన పదవిలో కొనసాగడానికి నైతిక అర్హత లేదు. రాజకీయాలలో ఇప్పటివరకు చొక్కా విప్పి నిరసన తెలియజేసిన మంత్రిని తాను చూడలేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన జగన్మోహన్ రెడ్డిని అభినందించాలని అపహాస్యం చేశారు. ప్రస్తుతం చొక్కా విప్పించారని, రేపు ఇంకా ఏమి విప్పిస్తారోనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు పై జరిగిన దాడి ఘటనను తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాను సుదీర్ఘమైన లేఖ రాసినట్లు రఘురామకృష్ణం రాజు మీడియా సమావేశంలో లేఖ ప్రతిని ప్రదర్శించారు. దాడి ఘటనపై, డీజీపీ, రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజి కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇచ్చే అవకాశం ఉంది. అయినా కేంద్రానికి ఇంటలిజెన్స్ బ్యూరో ( ఐబీ )ఉంటుందని, ఐబీ ద్వారా నివేదికలు తెప్పించుకుంటారన్నారు.

దగుల్బాజీ సంస్థగా మారిన సిఐడి

ప్రశ్నించిన వారందరికీ నోటీసులు జారీ చేస్తూ సిఐడి దగుల్బాజీ సంస్థ గా మారిందని రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. ఇటీవల
న్యాయవాదులు ప్రశ్నించగా , వారికి నోటీసులు జారీ చేశారు. ఇదే విషయాన్ని న్యాయవాదుల బృందం, ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలన గురించి తాను లేఖ ద్వారా ప్రధాన మంత్రికి నివేదించడంతోపాటు, హోంమంత్రికి కూడా తెలియజేయడం జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జరిపిన రాళ్ల దాడి లో ఎన్ ఎస్ జి కమాండోకు తగిలిన రాయి, చంద్రబాబు నాయుడు తల కణతకు తగిలి ఉంటే, ఆయన చనిపోయి ఉండేవారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రావణ, నరకాసుర, హిరణ్య కష్యుడి పాలనలో జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కలిగిన ప్రధాన ప్రతిపక్ష నేత, రక్షణకే దిక్కు లేకుండా పోతుంది. ఈ రాక్షస, దుర్మార్గపు పోలీస్, సిఐడి పాలన నుంచి రాష్ట్ర ప్రజలను
గవర్నర్ కాపాడాలి. గతంలో కసాయిలాగా వ్యవహరించే సాయి, సినీ హీరో నాగార్జున ప్రచారం చేస్తున్నా సంస్కారవంతమైన ట్రిపుల్ ఎక్స్ సోప్ ను ఉపయోగించినట్లుగా ఈ దరిద్రపు సంస్కృతి నుంచి బయట పడుతున్నాడు. అలాగే ఈ దుష్ట సమూహము నుంచి తనలాగే బయటపడితే మంచిదని సూచించారు. దుష్టులకు ఉన్నత విద్యావంతుడైన విజయసాయిరెడ్డి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నారు .

జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలపై అనుమానం వచ్చిన మాట నిజమే

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డి లపై సి.బి.ఐ కి అనుమానము వచ్చిన మాట నిజమే… అందుకే వారి వ్యక్తిగత సహాయకులను పిలిచి విచారించారని రఘు రామకృష్ణంరాజు తెలియజేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెల్లవారుజామున 6 గంటల 25 నిమిషాలకు అధికారికంగా తెలిసినప్పటికీ, అంతకుముందే అంటే సుమారు మూడున్నర గంటల సమయంలో భారతి రెడ్డి ఫోను దగ్గర పెట్టుకునే ఆమె వ్యక్తిగత సహాయకుడు చక్రాయపాలెం నవీన్ కు అవినాష్ రెడ్డి ఎందుకు ఫోన్ చేశారు. దీనితో, ఈ హత్యలో భారతి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ల పాత్ర ఉన్నదా అన్న అనుమానం రావడం సహజం. అనుమాన నివృత్తి కోసం సిబిఐ అధికారులు జగన్మోహన్ రెడ్డి ఓ ఎస్ డి, భారతి రెడ్డి వ్యక్తిగత సహాయకుడి ని విచారణకు పిలిచారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంగారుపడుతూ, అవినాష్ రెడ్డికి క్లీన్ చీట్ ఇవ్వడం ఈ అనుమానానికి మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ కు వచ్చిన అనుమానం అర్థం లేనిది కాదు. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించే అర్హత వారికి
ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డిని చంద్రబాబు నాయుడు హత్య చేయించారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తి దాడి చేయించింది కూడా చంద్రబాబు నాయుడే నని తమ పార్టీ చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారు కాబట్టే, వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో పట్టాభిషేకం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని, కోడి కత్తి దాడి ఒక డ్రామా అని విచారణలో తేలిపోవడంతో ఇప్పుడు ఏమి చేయాలో పాలు పోని పరిస్థితిల్లో తమ పార్టీ నాయకత్వం ఉందన్నారు.

షేక్ షమీం ను పిన్నిగా జగన్, అత్తగా భారతి అంగీకరించారు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి రెండవ పెళ్లి చేసుకున్నట్లుగా చెబుతున్న షేక్ షమీం ను ఆయన అన్నయ్య కుమారుడు జగన్మోహన్ రెడ్డి పిన్ని గాను, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి అత్తగా అంగీకరించడం సంతోషంగా ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి 2020 లోనే సిబిఐ అందరి వద్ద వాంగ్మూలాన్ని తీసుకున్నట్లుగానే, షేక్ షమీం వద్ద కూడా వాంగ్మూలాని తీసుకుంది. షేక్ షమీం ఇచ్చిన వాంగ్మూలానికి సరైన ఆధారాలు లేకపోవడంతో, ఆమె వాంగ్మూలాన్ని పక్కన పెట్టారు. 2015లో తమకు పుట్టిన పిల్లవాడిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని వైఎస్ వివేకానంద రెడ్డి భావిస్తే, ఆయన బావమరిది, అల్లుడు కూడా కంగారు పడిపోయారట. ఇదేమైనా రాచరికపు వ్యవస్థనా?, రాజకీయ వారసత్వాన్ని ప్రకటించడానికి?, ఆ కుర్రాడికి ఓటు హక్కు వచ్చే వయసు నాటికి, వైఎస్ వివేకానంద రెడ్డి బ్రతికి ఉండి ఉంటే ఆయనకు 92 ఏళ్ల వయసు వచ్చి ఉండేది. రెండు కోట్ల రూపాయల వెచ్చించి తన పేరిట విల్లా కొనుగోలు చేయాలని వైఎస్ వివేకానంద రెడ్డి భావించారని షేక్ షమీం పేర్కొనడం పరిశీలిస్తే, వైఎస్ వివేకానంద రెడ్డి విల్లా కొనుగోలు చేయలేదంటే ఆయన ఆర్థిక పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. అమెరికాలో తమ తమ వృత్తులలో స్థిరపడి, ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి, సునీతలు చివరి దశ లో వివేకానంద దంపతులతో గడపాలని మాతృదేశానికి తిరిగి వచ్చారు. ఆస్తిని ఇద్దరికీ పంచాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో నానా యాగి చేస్తున్నవారు, రేపు జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి ఎవరైనా వస్తే అలాగే అంగీకరిస్తారా?, వైఎస్ వివేకానంద రెడ్డి తో రెండవ వివాహానికి, ఆయన సతీమణి సోదరులు అంగీకరించలేదని షేక్ షమీం చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. సోదరులు ఎవరైనా తోబుట్టువు క్షేమాన్ని కోరుకుంటారు. తోబుట్టువు భర్త చేసుకోబోయే రెండవ వివాహాన్ని ఎవరైనా అంగీకరిస్తారా?. క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భార్యా బతికి ఉండగానే వివాహితుడైన పురుషున్ని రెండవ పెళ్లి చేసుకోవడం నేరం. నేరం చేసిన షేక్ షమీం ను సాక్షి దినపత్రిక సమర్ధించడం విస్మయాన్ని కలిగిస్తోంది. వయసులో వైఎస్ లు ఏదైనా తప్పు చేస్తే సరే కానీ, రెండు స్టంట్ లు వేయించుకున్న వృద్ధుడైన వ్యక్తితో సంసారం చేస్తాననడం తప్పే. వైయస్ వివేకానంద రెడ్డి శవానికి కుట్లు వేయించడానికి వైయస్ భాస్కర్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ మనోహర్ రెడ్డి, వైయస్ ప్రకాష్ రెడ్డిలు ఎందుకు వెళ్లారు. షేక్ షమీంతో అబద్ధం చెప్పి సాక్షి దినపత్రిక అడ్డంగా బుక్ అయిపోయి, కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.

గొడ్డలితో నరికారని జగన్ కు ఎలా తెలుసు

వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితోనే నరికి చంపారని వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. హత్యకు రకరకాల ఆయుధాలను వినియోగించే ఆస్కారం ఉన్నప్పటికీ, గొడ్డలితోనే తమ బాబాయిని హంతకులు హత్య చేశారని జగన్మోహన్ రెడ్డి అంత ఖచ్చితంగా ఎలా నిర్ధారించారు. రెండేళ్ల తర్వాత తాము వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో హత్య చేశామని అప్రూవర్ గా మారిన దస్తగిరి చెప్పారు. అప్పటివరకు ఆయన్ని గొడ్డలితో నరికి చంపినట్లుగా ఎవరికి తెలియదని, కానీ జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలుసు అంటూ ప్రశ్నించారు.

ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించండి

ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఆరోగ్యశ్రీ ఆగిపోతే తమ పార్టీ శ్వాస నిలిచిపోతుందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ కింద రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉండడంతో, మే 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయని అన్నారు. జి ఎస్ డి పి లో ఉత్తర ప్రదేశ్ 10% అప్పులను చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 80% అప్పులను చేసింది. ఒక్క నెలలోనే 6 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. అయినా 11 రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ లోనే ఉండడం విస్మయాన్ని కలిగించింది. కేంద్ర ప్రభుత్వం టైమ్స్ నౌ సర్వే నిజమనుకొని కాబోలు అప్పులు ఇస్తున్నట్లుగా ఉంది. ఇటీవల దీవెన వాయిదా పడింది. ఆరోగ్యశ్రీ ఇక ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు పెరిగిపోతున్నాయి. ఆస్తుల విలువ తరిగిపోతుంది. ఆస్తి పన్నులు మాత్రం అమాంతం పెరుగుతున్నాయని రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు.