NRI-NRT

314 కోట్లకు అమ్ముడైన బైబిల్…

314 కోట్లకు అమ్ముడైన బైబిల్…

క్రైస్తవులు బైబిల్‌ను తమ పవిత్ర గ్రంథంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. అయితే కోడెక్స్ సాసూన్ అనే హీబ్రు బైబిల్ ప్రపంచంలోనే అతి పురాతమైన బైబిల్‌లో ఒకటి. అయితే అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ బైబిల్‌ను అమ్మకానికి పెట్టారు. దాదాపు 1100 ఏళ్ల నాటి ఈ బైబిల్‌ను చాలామంది పోటిపడ్డారు. చివరికి ఈ బైబిల్ రూ.314 కోట్లకు ధర పలికింది. చేతితో రాసిన ఈ బైబిల్ ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన బైబిల్‌గా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.

అయితే ఈ బైబిల్‌ను రొమేనియాలో అమెరికా మాజీ రాయబారి ఆల్ఫ్రెడ్‌ బి.మోసెస్‌ దీన్ని కొనుగోలు చేశారు. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌లో ఉన్న మ్యూజియం ఆఫ్‌ జ్యూయిష్‌ పీపుల్‌కు ఈ బైబిల్‌ను విరాళంగా ఇచ్చారు. క్రీస్తు శకం 880 నుంచి 960 మధ్యకాలంలో ఈ బైబిల్‌ను రాసి ఉంటారని చరిత్రకారులు చెబుతున్నారు. రాతపత్రుల్లో 2021లో అమెరికా రాజ్యాంగం దాదాపు రూ.400 కోట్లకు పైగా ధర పలికింది. అలాగే లియోనార్డో డావిన్సీ రాసిన కోడెక్స్‌ లీసెస్టర్‌ అనే పుస్తకంపై 1994లో వేలం వేశారు. అప్పట్లోనే ఈ బుక్ రూ.300 కోట్లకు పైగా అమ్ముడుపోయింది.