Business

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన   స్టాక్  మార్కెట్లు

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఉదయం లాభాల్లో ట్రేడింగ్ ను ప్రారంభించినప్పటికీ… వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో నిన్నటి లాభాలను కోల్పోయి చివరకు నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 284 పాయింట్లు నష్టపోయి 63,238కి పడిపోయింది. నిఫ్టీ 85 పాయింట్లు కోల్పోయి 18,771కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాలను నమోదు చేశాయి.