బ్యాంక్ డిపాజిట్లు అందిస్తున్న అధిక రేట్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్తో సహా కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 0.3 శాతం మేర పెంచింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఈ పెంపుదల వర్తిస్తుందని శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఐదేండ్ల రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)పై 0.3 శాతం రేటు పెరుగుతుంది. ఆర్డీలు వేసినవారికి ప్రస్తుత 6.2 శాతం వడ్డీ రేటుకుగాను ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 6.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఇతర స్కీమ్లపై తాజా పెంపు వివరాలు
* ఒక ఏడాది టర్మ్ డిపాజిట్పై 0.1 శాతం అధిక వడ్డీ లభిస్తుంది. దీనిపై వడ్డీ రేటు 6.9 శాతానికి చేరుతుంది.
* రెండేండ్ల టర్మ్ డిపాజిట్పై రేటు 6.9 శాతం నుంచి 7 శాతానికి పెరుగుతుంది.
* మూడేండ్లు, ఐదేండ్ల పరిమితిగల టర్మ్ డిపాజిట్లపై మాత్రం రేటు యథాతథంగా 7%, 7.5% చొప్పునే కొనసాగుతుంది.
* ప్రాచుర్యం పొందిన పీపీఎఫ్ (7.1 శాతం), సేవింగ్స్ డిపాజిట్ (4 శాతం)పై రేట్లను పెంచలేదు.
* నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్పై వడ్డీరేటును సైతం యథాతథంగా 7.7 శాతం వద్దే స్థిరంగా ఉంచారు.
* ఇటీవల ప్రవేశపెట్టిన బాలికల పొదుపు స్కీమ్ సుకన్య సమృద్ధిపైనా రేటు ప్రస్తుత 8 శాతం స్థాయిలోనే ఉంచారు.
* కిసాన్ వికాస్ పత్రపై 8.2 శాతం, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్పై 7.5 శాతం రేటు కొనసాగుతుంది.
* 7.4 శాతం రాబడినిచ్చే మంథ్లీ ఇన్కం స్కీమ్పై వడ్డీ రేటు పెంచలేదు.