NRI-NRT

ఛార్లెట్‌ ప్రవాసులతో పరిటాల శ్రీరామ్‌ సమావేశం

ఛార్లెట్‌ ప్రవాసులతో పరిటాల శ్రీరామ్‌ సమావేశం

తెలుగుదేశం పార్టీ యువనాయకుడు పరిటాల శ్రీరామ్‌ నార్త్‌ కరోలినా రాష్ట్రంలోని ఛార్లెట్‌లో ప్రవాశులతో సమావేశం అయ్యారు.

ఈ కార్యక్రమానికి ఎన్నారై టీడిపి అభిమానులు, పరిటాల అభిమానులు హాజరయ్యారు. శ్రీరామ్‌ చేసిన ప్రసంగం ఉత్సాహపరిచింది. ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి పాలన వల్ల రాష్ట్ర ప్రగతి బాగా దెబ్బతిందని అధికార పార్టీ నాయకుల అక్రమాలతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని జరగనున్న ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలుపునకు ఎన్నారైలు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమాన్ని పురుషోత్తమ చౌదరి గూడె, రవి నాయుడు, సచ్చింద్ర ఆవులపాటి, వెంకట్ సూర్యదేవర, మహేష్ సూరపనేని, నాగ పంచుమర్తి, కృష్ణ మెడమనూరి, నరసింహ, పురుషోత్తమ, వెంకట్ మాలపాటి, ఠాగూర్ తదితరులు సమన్వయపరిచారు.