Business

వచ్చే ఏడాది 1500 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి:ఏపీ

వచ్చే ఏడాది 1500 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి:ఏపీ

ఏపీ ప్రజలకు శుభవార్త…వచ్చే ఏడాది నాటికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 1500 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని APSRTC నిర్ణయించింది. రూ. 650 కోట్లతో మొత్తం 7 కేటగిరీల కింద బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ టెండర్ల ప్రక్రియ చేపట్టింది.సర్వీసుల వారిగా ఎక్స్ప్రెస్ 542, సూపర్ లగ్జరీ 735, అల్ట్రాడీలక్స్ 145, స్టార్ లైనర్ 27, ఇంద్ర 32, వెన్నెల 8, అమరావతి 11 ఉన్నాయి. ఇందులో అమరావతి బస్సులను నేరుగా ఓలా సంస్థ నుంచి కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్‌ ఆర్టీసీ సంస్థ ప్రకటన చేసింది. ఏపీ ప్రజల సౌకర్య మేరకే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.