Politics

నేడు UNOలో కిషన్‌రెడ్డి ప్రసంగం

నేడు UNOలో కిషన్‌రెడ్డి ప్రసంగం

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి..అమెరికాకు వెళ్లారు. ఇందులో భాగంగానే ఇవాళ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ‘హైలెవల్ పొలిటికల్ ఫోరమ్’ (HLPF) వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం ఉండనుంది. HLPF వేదికగా ప్రసంగించనున్న తొలి భారత పర్యాటక శాఖ మంత్రిగా అరుదైన గౌరవం కిషన్‌ రెడ్డికి దక్కింది.జీ-20 టూరిజం చైర్ హోదాలో హాజరుకానున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అమెరికాలోని భారత కాన్సులేట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు కిషన్‌ రెడ్డి. అటునుంచే లండన్‌కు ప్రయాణం.. 19వ తేదీ ఉదయం ఢిల్లీకి తిరిగి రానున్నారు కిషన్ రెడ్డి. కాగా, ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి… నియామకం అయిన సంగతి తెలిసిందే.