భారత దేశం వ్యాప్తంగా టమాటాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎవరిని కదిలించినా టమాటాల గురించే మాట్లాడుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కిలో టమాటాల ధర రూ.200 ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో రూ.150కి పైగా ధర పలుకుతుంది. ఈ క్రమంలోనే పలు సంస్థలు టమాటాలకు ఉన్న ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలి చూస్తున్నాయి.దేశంలోని పలు వ్యాపార సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు టమాటా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా మధురైలోని ఓ ట్రావెల్ ఏజెన్సీ ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకుంటే.. టమాటాలు ఫ్రీ అంటూ ప్రకటించింది. మదురైలో దేశీయ విమాన టిక్కెట్ బుకింగ్ కు 1 కిలో టమాటా, అంతర్జాతీయ విమాన బుకింగ్ కు 1.5 కిలోల టమాటాలు ఇవ్వనున్నట్లు ఆ ట్రావెల్ ఏజెన్సీ ప్రకటించింది.
ఈ కొత్త ఆఫర్ కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ట్రావెల్ ఏజెన్సీ ప్రకటించడం గమనార్హం. జూలై 11, 12 తేదీల్లో ఈ ఆఫర్ చాలా మంది కస్టమర్లను ఆకర్షించిందని తెలుస్తోంది. పైగా మా వ్యాపారానికి టమాటాలు బాగా సహాయపడ్డాయని ఏజెన్సీ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.తమిళనాడులో టమాటాల ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో తక్కువ ధరకు టమాటాలను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే మధురైలోని ఓ ట్రావెల్ సంస్థ విమాన టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి టమాటాలు ఫ్రీ అంటూ ఆఫర్ ని ప్రకటించింది.