Sports

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

వెస్టిండీస్, భారత్ మధ్య మరికాసేపట్లో ఐదో టీ20 మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. టీమ్‌ఇండియా కెప్టెన్ హార్దిక్ పాండ్య టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత జట్టు.. ఐదో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

భారత్‌ తుది జట్టు:యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముకేశ్‌ కుమార్

విండీస్ తుది జట్టులో రెండు మార్పులు
ఒడియన్‌ స్మిత్ స్థానంలో రోస్టన్ చేజ్, మెకాయ్‌ స్థానంలో అల్జారీ జోసెఫ్‌ తుది జట్టులోకి తీసుకుంది.

తుది జట్టు: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షై హోప్, నికోలస్ పూరన్ (వికెట్‌ కీపర్‌), రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మయర్‌, జాసన్ హోల్డర్, రోస్టన్ చేజ్, రొమారియో షెఫర్డ్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్.