Politics

చంద్రబాబు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

చంద్రబాబు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

తనపై పెట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు దాఖలుచేసిన ఎస్‌ఎల్‌పీ సుప్రీంకోర్టు ముందు సోమవారం విచారణకు రానుంది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, న్యాయమూర్తి బేలా ఎం.త్రి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ నెల 3న ఒప్పందం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం… హైకోర్టు ముందు దాఖలుచేసిన పత్రాలను తమకు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. అందుకు అనుగుణంగా సోమవారం ఈ కేసు 59వ ఐటం కింద విచారణకు రానుంది. గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు చంద్రబాబు సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థలూథ్రా, రాష్ట్ర ప్రభుత్వం ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

202 సెప్టెంబరు 7న స్కిల్‌ సంస్థ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు డిసెంబరు 9న కేసు నమోదుచేశారని, అందుకే దీనికి గవర్నర్‌ ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాదించారు. అయితే, ఈ కేసు విచారణ 2018లో 17ఎ సెక్షన్‌ రాకముందే ప్రారంభమైనందున గవర్నర్‌ అనుమతి అవసరం లేదని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదించారు. ఏపీ హైకోర్టు తన తీర్పులో ఇదే చెప్పిందని. అయితే ధర్మాసనం ఆ పత్రాలను సమర్పించాలని చెబుతూ కేసును వాయిదా వేసింది. రాష్ట్రప్రభుత్వ అధికారులు పత్రాలు సమర్పించారు. చంద్రబాబు తరఫు న్యాయవాదులు అదనపు పత్రాలు సమర్పిస్తూ ఐఏ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్టయ్యి నెల రోజులు పూర్తి ప్రస్తుతం అందరి దృష్టీ సోమవారం సుప్రీం ఇవ్వబోయే ప్రకటనపైనే ఉంది.

చంద్రబాబుపై నమోదు చేసిననర్‌ రింగ్‌రోడ్డు, అంగళ్లు, ఫైబర్‌నెట్‌ కేసుల్లో బెయిల్‌ పిటిషన్లపై సోమవారం హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, పోలీసు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది.