11 గంటలకు జగిత్యాలలో మీటింగ్, 12 గంటలకు వేములవాడ నియోజక వర్గం మేడిపల్లిలో, ఒంటిగంటకు కోరుట్లలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తారు రాహుల్గాంధీ. మధ్యాహ్నం తర్వాత నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పర్యటించి పార్టీ క్యాడర్లో జోష్ నింపబోతున్నారు కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ. స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో కార్యకర్తలతో పాటు ప్రజలతో మాట్లాడతారు. రాహుల్ టూర్ సందర్భంగా కాంగ్రెస్లో చేరికల పర్వం కొనసాగనుంది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు. మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మూడురోజుల పర్యటన ముగించుకున్న సాయంత్రం ఆర్మూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ చేరుకుంటారు రాహుల్. అట్నుంచి ఢిల్లీ వెళతారు. తెలంగాణాలో రాహుల్గాంధీ ఏకంగా మూడురోజుల పాటు సుడిగాలి పర్యటన చేపట్టడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
👉 – Please join our whatsapp channel here –