తానా సంస్థ ప్రధాన కార్యాలయం డెట్రాయిట్లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఉంది. ఈ ఆలయ ట్రస్ట్ బోర్డులో తానా నుండి ఒక సభ్యుడిని ప్రతినిధిగా నియమిస్తారు. 2023-25 కాలానికి గానూ తానా తరఫున డెట్రాయిట్లోని శ్రీ వేంకటేశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా బేతంచర్ల ప్రసాద్ నియమితులయ్యారు. బ్లూమ్ఫీల్డ్ హిల్స్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసాద్ను తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ చేతుల మీదుగా ప్రవాసులు సత్కరించారు. గడిచిన దశాబ్ద కాలంగా ఆలయానికి విశేష సేవలు అందించిన ప్రసాద్ను ఈ పదవి వరించడం పట్ల అతిథులు హర్షం వెలిబుచ్చారు.
తానా కార్యాలయ సంచాలకుడు కోడూరు చలపతి, సాంస్కృతిక విభాగ అధ్యక్షురాలు గొంది మను, వెబ్సైట్ ఉపాధ్యక్షుడు దేవబత్తిని హరి తదితరులను కూడా ఈ కార్యక్రమంలో సత్కరించారు. కార్యక్రమంలో సన్నీరెడ్డి, యద్దం బాలాజీ, బడ్డి అశోక్, ట్రాయి తెలుగు సంఘం ప్రతినిధులు చెంచు రెడ్డ్, ఆలపాటి కృష్ణ ప్రసాద్, జంపాల విష్ణు తదితరులు పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z