Sports

ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్కు బెదిరింపు

ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్కు బెదిరింపు

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మరికొన్ని గంటల్లో ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ ను చూసేందుకు చాలా మంది సెలబ్రేటీలు కూడా వస్తున్నారు. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో ముంబై పోలీసులు అలెర్ట్ అయ్యారు. గుర్తుతెలియని వ్యక్తి ట్విట్టర్ లో బెదిరింపులకు పాల్పడ్డాడని ముంబై పోలీసులు తెలిపారు.

ఈ పోస్ట్‌లో ముంబయి పోలీసులను ట్యాగ్‌ చేసిన ఆ ఆగంతకుడు.. తుపాకీ, హ్యాండ్‌ గ్రనేడ్‌, బుల్లెట్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. దీంతో స్టేడియం, ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ వరల్డ్ కప్ లో బెదిరింపులు రావడం ఇదేం తొలిసారి కాదు.. అక్టోబరు 14న జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ సమయంలోనూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z