Politics

ఏపీకి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం

ఏపీకి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం

జగన్ సర్కారుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర పెద్దలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, దీనిపై తమ పార్టీ హైకమాండ్ పెద్దలకు ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు.

“తెలంగాణలో మేము జనసేనతో పొత్తులో ఉన్నాం. రాష్ట్రం అవినీతిమయంగా మారింది. ఇసుక మాఫియా, మద్యం దోపిడీ జరుగుతోంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర పెద్దలు జేబులు నింపుకుంటున్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య లేదు. జిల్లాల అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంది.” అని పురందేశ్వరి చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z