Politics

రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది

రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది

తెలంగాణలో నిశ్శబ్ద విప్లమం జరుగుతోందని, డిసెంబర్‌ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రమాణస్వీకారం ప్రజల సమక్షంలో జరుగబోతుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Former Minister Tummala Nageswara Rao) అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం గురువారం రాత్రి అమీర్‌పేట వెస్ట్‌ శ్రీనివాసనగర్‌ కాలనీ కమ్యూనిటీ హాలులో జరిగింది. కాంగ్రెస్‌ ప్రత్యేక తెలంగాణ ఇస్తే కేసీఆర్‌ కుటుంబ పాలన జరుగుతోందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో అవినీతి జరిగిందని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని, కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అజారుద్దీన్‌ను గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z