తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ లిస్టు ఉత్తర్వులను ఆదివారం జారీ చేసింది.
* విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. కళాశాల, సాంకేత విద్యాశాఖ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
* పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్ కుమార్ విపత్తు నిర్వహణశాఖకు బదిలీ అయ్యారు.
* పురపాలక ముఖ్యకార్యదర్శిగా దానకిశోర్ నియమితులయ్యారు. ఆయనకు హెచ్ఎండీఏ, సీడీఎంక కమిషనర్గా అదనపు బాధ్యతలను అప్పగించారు.
* వాణిజ్య పన్నులశాఖ కమిషనర్గా టీకే శ్రీదేవి
* నల్గొండ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ బదిలీ అయ్యారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్గా ఆర్.వి కర్ణన్ను నియమించారు.
* ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కే.ఎస్ శ్రీనివాసరాజును నియమించారు.
* జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. ఎస్సీ అభివృద్ధి కార్యదర్శి అదనపు బాధ్యతలు ఇచ్చారు.
* జలమండలి ఎండీగా సుదర్శన్రెడ్డి
* వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా
* అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణి ప్రసాద్ను నియమించారు. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్గా వాణిప్రసాద్కు అదనపు బాధ్యతలు ఇచ్చారు.
* మహిళ శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ నియమితులయ్యారు.
👉 – Please join our whatsapp channel here –