న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. స్నేహితులంతా ఒక చోట చేరి డ్యాన్స్లు చేస్తూ, కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. ఈ సందర్భంలో ఆహారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. నచ్చిన ఫుడ్ను ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరీ తింటుంటారు. అయితే, కోల్కతాలోని ఓ వ్యక్తి చేసిన పనికి ఫుడ్ యాప్ జొమాటో యజమానే ఆశ్చర్యపోయారు. అతడు పదో, ఇరవైయ్యో కాదు ఏకంగా 125 రుమాలీ రోటీలను జొమాటోలో ఆర్డర్ చేశాడు. దీంతో ఆ సంస్థ సీఈవో దీపిందర్ గోయల్ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు. ఆ పార్టీకి వెళ్లాలని ఉందంటూ తన కోరికను బయటపెట్టారు. ‘‘ ఒక్క ఆర్డర్లోనే 125 రుమాలీ రోటీలు ఆర్డర్ చేశారు. ఆ పార్టీకి నిజంగా వెళ్లాలనిపిస్తోంది’’ అని గోయల్ పోస్టు చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
👉 – Please join our whatsapp channel here –