తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘నిజం గెలవాలి’ పర్యటనలు మళ్లీ ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్ట్తో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. వారానికి మూడు రోజుల పాటు ఆమె పర్యటిస్తారు. ఈనెల 3 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు.
3న విజయనగరం, 4న శ్రీకాకుళం, 5న విశాఖపట్నం జిల్లాలకు భువనేశ్వరి వెళ్లనున్నారు. ఇప్పటికే పలు కుటుంబాలను ఆమె పరామర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ ‘నిజం గెలవాలి’ పేరిట పర్యటనలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –