NRI-NRT

ఘనంగా సింగపూర్ స్వరలయ 5వ వార్షికోత్సవం

ఘనంగా సింగపూర్ స్వరలయ 5వ వార్షికోత్సవం

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు 2024 మార్చ్ 3 అదివారం నాడు 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్య వై. రెడ్డి శ్యామల, పీఠాధిపతి, భాషాభివృద్ధి పీఠం, డైరెక్టర్ ఐ/సి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం, పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం విచ్చేసి తెలుగు భాష మన దైనందిన జీవితానికి ఎంతో ముఖ్య మైనది అని వివరించారు.

అన్నమయ్య పద మాధుర్యం గురించి మాట్లాడుతూ వీరు శేషుకుమారి గానం, ప్రత్యూష నాట్యాలను మేళ వించి మధుర మైన భావనతో ప్రేక్షకులను మైమరిపించారు. ఈ కార్యక్రమానికి  STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్, TAS (మనం తెలుగు) అసోసియేషన్ అనిత రెడ్డి, శ్రీ సాంస్కృతిక కళా సారథి రత్న కుమార్,
కమల క్లబ్ అధ్యక్షులు,సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు, మగువ మనసు అడ్మిన్ ఉష, సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ శ్రీ క్రాంతి, జయ, ప్రత్యూష , సింగపూర్ సుమన్ టీవీ అరుణ ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయ్యారు.

స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి మరియు వారి శిష్యులు చిన్నారులు కీర్తనలను ఆలపించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ కు అనుబంధ సంస్థ అభినయ నాట్యాలయ చిన్నారులు ప్రత్యూష శిష్యులు నాట్యం ప్రదర్శించారు. పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు ఆచార్య వై. రెడ్డి శ్యామల బహుమతి ప్రదానం చేశారు. అతిథులకు యడవల్లి శేషుకుమారి, ఆచార్య వై.రెడ్డి శ్యామల మూమెంటోలను బహుకరించారు. శివకుమార్ మృదంగంపై వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి సౌజన్య, ఆచంట ప్రసన్న వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z