NRI-NRT

సౌదీ అరేబియాలో తెదేపా-జనసేన భేటీ

సౌదీ అరేబియాలో తెదేపా-జనసేన భేటీ

సౌదీ అరేబియాలోని జుబైల్‌లో తెదేపా-జనసేన ఎన్నారై కూటమి భేటీ అయ్యింది. రాబోయే ఎన్నికలకు వ్యూహరచన చేసేందుకు ‘ఎన్నికల సన్నాహక ఆత్మీయ సమావేశం’ పేరిట ఈ భేటీ నిర్వహించారు. తెదేపా తరుఫున గల్ఫ్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, సౌదీ అధ్యక్షుడు ఖాలిద్ షైఫుల్లా, భరద్వాజ్, కోగంటి శ్రీనివాస్‌, చంద్రశేఖర్, నాగేశ్వరరావు, జనసేన సౌదీ అరేబియా కన్వీనర్లు గుండాబత్తుల సూర్య భాస్కరరావు, కసిరెడ్డి శ్రీ నగేష్, చింతల మూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సమావేశానికి బహ్రెయిన్ తెదేపా గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు హరిబాబు తక్కిళ్లపాటి, వాసుదేవ రావు, తెదేపా, జనసేన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, సీనియర్‌ సభ్యులు హాజరయ్యారు. గెలుపే లక్ష్యంగా కూటమి నేతలంతా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. జూమ్ కాల్‌లో తెదేపా నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, జనసేన నాయకుడు కందుల దుర్గేష్, జనసేన వైజాగ్ నార్త్ నియోజకవర్గ ఇంఛార్జ్‌ పసుపులేటి ఉషా కిరణ్, బండిరెడ్డి రామకృష్ణ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కూటమిని బలోపేతం చేయడానికి ఇరు పార్టీల నేతలు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z