Movies

రవితేజ వస్తే.. మెరుపులే!

Auto Draft

రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 29న విడుదల అవుతోంది. ఈ చిత్రంతోనే రజిషా విజయన్‌ టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారు. ఈ సందర్భంగా రజిషా మాట్లాడుతూ ‘‘తమిళంలో ధను్‌షతో చేసిన ‘కర్ణన్‌’ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ‘రామారావు’లో నటించే అవకాశం రావడానికి కారణం కూడా ఆ చిత్రమే. తెలుగులో ఇది వరకు కూడా నాకు ఆఫర్లు వచ్చాయి. కానీ బలమైన కథ, కథనాలున్న సినిమా కోసం ఎదురు చూశా. ఆ అవకాశం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’తో దక్కింది. ఇందులో నా పేరు మాలిని. చాలా హుషారైన పాత్ర. నటనకు ఆవకాశం ఉంది. రవితేజ లాంటి సీనియర్‌తో నటించడం గొప్ప అదృష్టం. ఆయన చాలా సరదాగా ఉంటారు. సెట్‌కి వస్తే.. ఓ మెరుపు మెరిసినట్టే ఉంటుంది. ఆయన నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్‌ అయ్యాయి. అవన్నీ చూశాను. ఇప్పుడంటే పాన్‌ ఇండియా అంటున్నారు గానీ, అప్పట్లోనే రవితేజ చిత్రాలకు ఆ రీచ్‌ ఉండేది. నేను తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకొంటున్నా. త్వరలోనే నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకొంటా.