మనుషులు, జంతువుల్లో ఇన్ఫెక్షన్ను గుర్తించి, నయం చేసేందుకు అవసరమైన పరిశోధనను సంగారెడ్డికి చెందిన కిరణ్మయిజోషి చేశారు. ఇదే అంశంపై అమెరికన్ సొసైటీ ఫర్ సెల్ బయోలజీ, యూరోపియన్ మాలిక్యులార్ బయోలజీ ఆర్గనైజేషన్ సంయుక్తంగా డిసెంబర్ 3 నుంచి 7 వరకు వాషింగ్టన్ డీసీలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో కిరణ్మయి ప్రెజంటేషన్ ఇవ్వనున్నారు.భారతదేశంనుంచి సదస్సులో పాల్గొనే అవకాశం దక్కింది. ఇందుకు భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని బయో టెక్నాలజీ విభాగం అనుమతిచ్చింది. సదస్సులో పాల్గొనే అవకాశం తన ఒక్కరికే రావడం సంతోషంగా ఉందని కిరణ్మయి జోషి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. సంగారెడ్డికి చెందిన కిరణ్మయి రిటైర్డ్ హెడ్మాస్టర్ కూతురు. కోఠి ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ, కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో ఎంఎస్సీ పూర్తిచేశారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీలో పీహెచ్డీ చేస్తున్నారు. కిరణ్మయికి గైడ్గా సైంటిస్టు డాక్టర్ గిరిష్ కె రాధాకృష్ణన్ వ్యవహరిస్తున్నారు.