రాజకీయాల్లో చంద్రబాబు స్థాయి.. తన స్థాయి ఒక్కటేనని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. తనతో పోల్చుకుంటే నారా లోకేశ్ స్థాయి చాలా తక్కువ అని విమర్శించారు. కంచికచర్ల మండలం పెండ్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని.. కేశినేని చిన్ని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాల్మనీ గాళ్ల మాటలకు సమాధానం చెప్పనని.. ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడుతానని తెలిపారు.
ఉత్తర కుమార ప్రగల్భాలు పలకవద్దని కేశినేని చిన్నికి ఎంపీ నాని సూచించారు. టీడీపీకి రాజీనామా చేసిన తర్వాతనే వైసీపీలో చేరానని ఆయన తెలిపారు. ఏపీ సీఎం జగన్ పిలుపు మేరకే వైసీపీలో చేరానని వెల్లడించారు. టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని కేశినేని నాని అన్నారు. అవసరమైతే 100 శాతం కూడా ఖాళీ చేయిస్తానని సవాలు విసిరారు.
👉 – Please join our whatsapp channel here –