తెలంగాణలో త్వరలో జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయాలతో చరిత్ర సృష్టించాలని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీలే తమ నియోజకవర్గాలకు పూర్తి బాధ్యులుగా ఉంటారని చెప్పారు. శనివారం పార్లమెంట్హౌస్కాంప్లెక్స్లో పార్టీ ఎంపీల ట్రైనింగ్పోగ్రాం‘అభ్యాస్వర్గ’లో షా మాట్లాడారు. ఇందులో ఉభయ సభలకు చెందిన 380 మంది పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు ఎంపీల వైఖరిపై వస్తున్న ఆరోపణలపై షా సీరియస్ అయ్యారు. అధికారం చేపట్టామన్న పొగరుతో వ్యవహారించవద్దని, ప్రజలతో మమేకం కావాలని హితబోధ చేసినట్లు సమాచారం. ఎంపీలందరూ పార్లమెంట్కు విధిగా హాజరుకావాల్సిందేనని స్పష్టంచేశారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ట్రైనింగ్పోగ్రాంను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. శిక్షణ తరగతుల్లో ప్రధానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘పార్టీ ఐడియాలజీ, ఆలోచనలే బీజేపీని ఇప్పుడీ స్థితికి చేర్చాయి. పార్టీ ఎదుగుదల వెనక కార్యకర్తల కృషి ఉంది తప్ప వారసత్వ రాజకీయాలో, ఏ ఒక్క కుటుంబమో లేదు. మన విజయం వెనకా ఉన్నది వారే.. కన్నతల్లిలా పెంచి, ఈ స్థాయికి చేర్చిన కార్యకర్తలను మరవొద్దు’ అంటూ ప్రధాని పార్టీ ఎంపీలకు సూచించారు. భార్య వచ్చాక తల్లిని నిర్లక్ష్యం చేసినట్లు.. పదవి వచ్చాక కార్యకర్తలను చులకనగా చూడొద్దని హితవు పలికారు.
తెలంగాణాలో భరీ గెలుపుతో చరిత్ర రాయాలి
![Amith Shah Aims To Grab Municipalities In Telangana-తెలంగాణాలో భరీ గెలుపుతో చరిత్ర రాయాలి Amith Shah Aims To Grab Municipalities In Telangana-తెలంగాణాలో భరీ గెలుపుతో చరిత్ర రాయాలి](https://images.abplive.in/v2/aHR0cHM6Ly9zdGF0aWMuYWJwbGl2ZS5pbi93cC1jb250ZW50L3VwbG9hZHMvMjAxOS8wNi8yNTEyMjMxMS9hbWl0LXNoYWgtYWZwLTEuanBnIzY0MDo0ODAjcmVzaXplI2pwZWc=/amit-shah-afp-1.jpg)
Related tags :