Business

రూపాయికి చికెన్ బిర్యానీ

One Rupee Chicken Biryani Offer Is Here

చికెన్ బిర్యానీ అంటే చాలు నాన్ వెజ్ ప్రీయులు ఎవరైనా సరే లొట్టలేసుకుంటూ తినేస్తారు. సమ్మర్, వింటర్ సీజన్ ఏదైనా సరే బిర్యాని అంటే పడి చస్తారు. అందుకే నాన్ వెజ్ రెస్టారెంట్లు కూడా ఎప్పటికప్పుడు ఇందులో రకరకాల రిసిపీలతో మాంసాహార ప్రియుల కోసం ప్రత్యేకంగా డిష్ లు ఏర్పాటు చేసి వడ్డీ వారిస్తుంటారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అద్భుతమైన ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటాయి. అయితే ఓ హోటల్ ఓనర్ ఏకంగా రూపాయికే చికెన్ బిర్యానీ ఆఫర్ అందించాడు. దీంతో ప్రజలు ఆ హోటల్ కు బారులు తీరారు. తమిళనాడు తిరువళ్లూర్ జిల్లా పోన్నీరిలో ఓ హోటల్ రూ. రూపాయికే చికెన్ బిర్యానీ అందించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నాన్ వెజ్ ప్రియులు హోటల్ వద్దకు బారులు తీరారు దీంతో అక్కడ తోపులాటలు, తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేసారు. ప్రపంచాన్ని గడ గడలదిస్తున్న కరోనా వైరస్ బ్రాయిలర్ కొల్ల ద్వారా వ్యాపిస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా కోళ్ళ విక్రయాలతో పాటు.. చికెన్ ధరలు కూడా అమాంతంగా పడిపోయాయి. నిన్నమొన్నటి వరకు రూ.200కు పైగా పలికిన చికెన్ ధరలు కరోనా వైరస్ ప్రభావంతో వంద రూపాయలకు చేరింది. కొన్ని ప్రాంతాల్లో అయితే కిలో చికెన్ రూ. 40కు అమ్ముతున్నారు. నిత్యం నాన్ వెజ్ తినేవాళ్ళు సైతం చికెన్ అంటేనే భయపడిపోతున్నారు. కొందరు ప్రత్యంయయంగా మటన్, ఫిష్ కొనుగోలు చేస్తున్నారు. చికెన్ అన్నా, చికెన్ బిర్యానీ అన్న కొనేందుకు వెనుకాడుతున్నారు. దీంతో హోటల్ యజమానులు చికెన్ బిర్యానీ కొంటె చికెన్-65 ఉచితమంటూ ప్రకటిస్తున్నారు. దీంతో హోటల్ యజమానులు చికెన్ బిర్యానీ కొంటె చికెన్ -65 ఉచితం అంటూ ప్రకటిస్తున్నారు. ఈనేపద్యంలో పొంనేరిలో గురువారం కొత్తగా ఓ హోటల్ ప్రారంభమైంది. ప్రారంభం సందర్భంగా రూ.1కే చికెన్ బిర్యానీ అని బోర్డులు పెట్టడంతో ప్రజల బారులు తీరారు. తొలిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకే విక్రయాలు ప్రారంభించగా రెండు గంటల్లోనే 120 కిలోల చికెన్ బిర్యానీ అమ్ముడైపోయింది. ఈ విషయమై హోటల్ యజమాని మాట్లాడుతూ కొత్తగా హోటల్ ప్రారంభించమని కరోనా వైరస్ భయంతో చికెన్ బిర్యానీ విక్రయమవుతుందా అనే సందేహ, కలిగిందన్నారు. దీంతో రూ.1కే అని ప్రకటించిన రెండు గంటల్లోనే బిర్యాని విక్రయమైదని ఆయన తెలిపారు.