Sports

2022కి T20 ప్రపంచకప్ వాయిదా

2020 T20 Worldcup Postponed To 2022

2020లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ పోటీలు 2022కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఐసీసీ వర్గాలు మాత్రం నిజమేనంటున్నాయి. 2021 అక్టోబర్‌లో టీ 20 ప్రపంచ కప్ పోటీలు భారత్‌లో నిర్వహించాల్సి ఉంది. 2022లో ఆస్ట్రేలియా టీ 20 ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తుంది. 2023లో భారత్ 50 ఓవర్ల ప్రపంచ కప్ పోటీలు నిర్వహిస్తుంది. ఈ నెల 28న జరిగే ఐసీసీ కీలక సమావేశంలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ పోటీలు 2022కు వాయిదా పడ్డాయన్న వార్తలపై ఐసీసీ అధికార ప్రతినిధి స్పందించారు. టీ20 ప్రపంచ కప్ పోటీలు ఈ ఏడాదే నిర్వహించేందుకు ముందు అనుకున్న ప్రకారమే సన్నాహాలు కొనసాగుతున్నాయన్నారు. అయితే దీనిపై స్పష్టత ఐసీసీ కీలక సమావేశం తర్వాతే వస్తుందని చెప్పారు. మరోవైపు ఐపీఎల్ పోటీలు అక్టోబర్ నవంబర్ మాసాల్లో నిర్వహించే అవకాశాలున్నాయి. భారత్‌లో కరోనా తీవ్రత తగ్గితేనే ఐపీఎల్ పోటీలు నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.