కరోనా నేపథ్యంలో సురక్షిత ప్రయాణం కోసం భారతీయ రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నది.
అందుకోసమే “ పోస్ట్ కోవిడ్ బోగీ’’ పేరుతో మెరుగైన సదుపాయాలతో రైలుబోగీని రూపొందించింది.
కోవిడ్ వైరస్ నివారణే లక్ష్యగా తయారు చేసిన కోవిడ్ రైలుబోగీలో చేతులు వాడాల్సిన అవసరంలేదు.
కాలితో వాడటానికి వీలైన నీటి కుళాయి, సబ్బు డిస్పెన్సర్, మరుగుదొడ్డి తలుపు గొళ్లాలు కాలితోనే వాడేలా ఫ్లష్ వాల్వు లు ఏర్పాటు చేశారు.
అంతేకాదు కాలితో మరుగుదొడ్డి తలుపు గొళ్లాలు, మోచేతి సాయంతో తోయగలిగిన ప్రవేశద్వారపు తలుపు ఈ బోగీల్లో ఏర్పాటు చేశారు.
పోస్ట్ కోవిడ్ బోగీలకు రాగిలోహపు పూత పూసిన చేతి రెయిలింగ్స్, గొళ్లాలు రూపొందించారు.
వైరస్ కణాలను రాగి కేవలం కొన్ని గంటల్లోనే క్షీణింపజేస్తుంది.
పలు సూక్ష్మజీవులను కట్టడిచేసే స్వభావం కూడా రాగికి ఉంది.
వైరస్ రాగిపై పడినపుడు రోగకారకమైన ప్యాథోజెన్లను రాగి అయాన్ దెబ్బతీసి, వైరస్ లోని డి.ఎన్.ఎ., ఆర్.ఎన్.ఎ.లను నాశనం చేస్తుంది.
బోగీ ఎయిర్ కండిన్డ్ డక్టులో గాలి శుద్ధీకరణకోసం ప్లాస్మా పరికర వ్యవస్థను ఏర్పాటు చేశారు.
గాలిలోని హానికరమైన బ్యాక్టీరియాను, ఏసీ బోగీలో ఉండే బ్యాక్టీరియాను ఇది సమర్థవంతంగా తొలగిస్తుంది.
టిటేనియం డైయాక్సైడ్ తో పూత
కోవిడ్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి రూపొందించిన ఈ బోగీకి టిటేనియం డైయాక్సైడ్ పూత పూసి ఉంటుంది.
ఇది ఫొటోయాక్టివ్ పదార్థంలా పనిచేసి అన్ని రకాల వైరస్ కణాలను, బ్యాక్టీరియాను, శిలీంద్రాలను నాశనం చేస్తుంది. బోగీలోని గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.
ఈ పదార్థం ఏ మాత్రం విషపూరితం కాదని అమెరికా ఆహార, ఔషధ పరిపాలనా విభాగం (ఎఫ్.డి.ఎ.) ధ్రువీకరించింది.
చాలా సురక్షితమైనది, ప్రయాణికులకు ఏ మాత్రం హానిచేయనిది అయిన టిటేనియం డైయాక్సైడ్ (TiO2 ) అనే ఈ ఫొటో యాక్టివ్ పదార్థాన్ని వాష్ బేసిన్లు, లావెట్రీలు, సీట్లు, బెర్తులు, స్నాక్ టేబుల్స్, కిటికీల గాజు తలుపులతో పాటుగా బోగీలోని దాదాపు ప్రతి ఉపరితలంపై పూతగా వినియోగించారు.
ఈ పూత 12నెలలపాటు పనిచేస్తుంది.