NRI-NRT

భారత్‌లో కొత్తగా ఏడు వీసా కేంద్రాలు

భారత్‌లో కొత్తగా ఏడు వీసా కేంద్రాలు

భారత్‌లో ఏడు వీసా జారీ కేంద్రాలను ప్రారంభించినట్లు ఫ్రాన్స్‌ ప్రకటించింది. వీటిలో హైదరాబాద్‌ కూడా ఒకటి. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, కోచి, బెంగళూరు, చెన్నై మిగతావి. విద్యార్థులు, పరిశోధకులు, టీచర్లు ఫ్రాన్స్‌లోని వివిధ సంస్థల్లో చేరేందుకు గాను వీసా కోసం ఈ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఫ్రెంచి రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఫ్రాన్స్‌లోని విద్యా, పరిశోధన సంస్థల నుంచి అడ్మిషన్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారు ఈ కేంద్రాలకు వెళ్లి అప్లయ్‌ చేసుకోవాలి. కొవిడ్‌ కారణంగా వారం వారం కొద్ది మంది చొప్పున వీసా ప్రాసెసింగ్‌లు చేసి జారీ చేస్తామని రాయబార కార్యాలయం పేర్కొంది.