DailyDose

చంపుతామని వైకాపా ఎమ్మెల్యే సన్నిహితుడి బెదిరింపులు-నేరవార్తలు

చంపుతామని వైకాపా ఎమ్మెల్యే సన్నిహితుడి బెదిరింపులు-నేరవార్తలు

* శ్రీలంకలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. బియ్యం, పంచదార, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, కిరోసిన్‌, పాల పౌడరు వంటి నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడటంతో ధరలు రెండింతలు పెరిగాయి. చక్కెర కిలో రూ.200 అయింది. మున్ముందు సరుకులు దొరక్కపోతే ఎలా అన్న ఆందోళనతో ప్రజలు, కిరాణాషాపులకు పోటెత్తుతున్నారు. పరిస్థితి చేయిదాటి పోవడంతో ఆ దేశాధ్యక్షుడు గోటాబాయా రాజపక్సే ఆహార అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. నిత్యావసర వస్తువులను నిల్వచేసిన వారిపట్ల పట్ల కఠినంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే జరిమానాను మరింత పెంచారు. శ్రీలంక ఆర్థిక పరిస్థితిని కరోనా కకావికలం చేసింది. అక్కడ కొవిడ్‌తో రోజుకు 200 దాకా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మహమ్మారి ఫలితంగానే 2020లో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 3.6శాతం మేర మందగించింది. ఆ దేశానికి విదేశీ మారక నిల్వల ఆర్జన పరంగా అత్యంత ప్రధానమైనది పర్యాటక రంగం. ఆ దేశ జీడీపీలో 5శాతం వాటా ఈ రంగానిదే. 2019లో ఈస్టర్‌ రోజున ఆత్మాహుతి దాడుల కారణంగా 250 మంది మరణించడంతో పర్యాటక రంగానికి తీవ్ర విఘాతం కలిగింది. తర్వాత పరిస్థితులు మెరుగుపడి నెమ్మదిగా విదేశీ పర్యాటకుల రాక పెరుగుతున్నంతలోనే కొవిడ్‌తో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఇక దిగుమతుల పరంగా ఏడాదికి 400 మిలియన్‌ డాలర్లు పొదుపు చేయాలనే ఉద్దేశంతో గత ఏప్రిల్‌లో పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. రసాయనిక ఎరువుల బదులు సేంద్రియ ఎరువులు వాడాలని రైతులను ప్రోత్సహించింది. కానీ, పంట దిగుబడులు పెద్దగా రాలేదు. ఏటా లంకలో 300 మిలియన్‌ కేజీల తేయాకు పంట ఉత్పత్తి జరిగితే అది సగానికి పడిపోయింది. ఎగుమతుల పరంగా శ్రీలంక వార్షిక ఆదాయంలో టీ ఉత్పత్తుల వాటా 10శాతం. ఆ రకంగా టీ ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. సేంద్రియ ఎరువుల వ్యూహం బెడిసికొట్టడంతో మిగతా పంటల ఉత్పత్తులూ తీవ్ర స్థాయిలో పడిపోవడమూ ఆహార సంక్షోభానికి దారితీసింది. ప్రైవేటు బ్యాంకుల్లో విదేశీ మారక నిల్వలు అడుగంటిపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీయడంతోనూ శ్రీలంకకు ఈ పరిస్థితి దాపురించింది. ఈ ఏడాది అమెరికా డాలర్‌తో శ్రీలంక కరెన్సీ 7.5శాతం పడిపోవడం కూడా ఆ దేశాన్ని ఆర్థికంగా కష్టాల్లోకి నెట్టింది.

* అనంతపురంలో ఓ హోటల్లో భాషా అనే ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ మరియు డెమో అధ్యక్షులు పిలుపు మేరకు ఈ రోజు అనగా 6వ తేది సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఫోటో స్టూడియో & లాబ్స్ బంద్ చేసి RTC బస్టాండ్ నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు కరోనా నిబంధనలు పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు.సూళ్ళూరుపేట ఫొటోగ్రాఫర్ & విడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆవల దాసు మాట్లాడుతూ అనంతపురం హోటల్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని నిరసన తెలియజేసారు.ఫోటోగ్రఫి వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం సూళ్ళూరుపేట SI P.రవిబాబు కు మరియు తహసీల్దారు రవికుమార్ లకు మెమోరాండం అందజేశారు.ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట ఫోటోగ్రాఫర్స్ మరియు విడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అస్సోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

* చిత్తూర్ తాలూకా పోలిసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడు అరెస్ట్ మరియు సుమారు లక్ష రూపాయలు విలువ చేసే నాలుగు కేజీల గంజాయిని మరియు రూ.50,000/-లు డబ్బులు మరియు రెండు కొత్త సెల్ ఫోనులు స్వాదినము.

* కృష్ణాజిల్లా….విజయ పాల వ్యాను ఢీకొని వృద్దురాలు మృతి…గన్నవరం పవర్ స్టేషన్ వద్ద సోమవారం ఉదయం ఘటన…ప్రమాదంలో బాయమ్మ 70 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి…చెత్త పారపోయాడానికి రోడ్డు మీదకు వచ్చిన బాయమ్మ…..వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.

* అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి సన్నిహితుడు జయరామిరెడ్డి బరితెగింపు.రాయదుర్గం – కనేకల్ రహదారి పనులు నిలిపివేయాలని కాంట్రాక్టరుకు హెచ్చరిక.ఎమ్మెల్యేను కలవకుండా పనులెలా చేస్తావని హుంకరింపు.పనులు ఆపకపోతే భౌతిక దాడులకు దిగుతామని బెదిరింపు.