WorldWonders

లంచం అడిగినందుకు RTOను చంపిన లారీడ్రైవర్-నేరవార్తలు

లంచం అడిగినందుకు RTOను చంపిన లారీడ్రైవర్-నేరవార్తలు

* లంచం అడిగినందుకు లారితో గుద్ది చంపిన డ్రైవర్.!రాజస్థాన్ లోని ఒక లారి డ్రైవర్ ని అర్ టి ఓ అధికారులు అపి లారీని చెక్ చేసారు.అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అయినా లంచం అడిగారు.లారి డ్రైవర్ దగ్గర పేపర్లు అన్ని కరెక్ట్ గానే ఉన్నా చూపించినా కూడా అధికారులు వదలలేదు.లారీ డ్రైవర్ కు కోపం వచ్చి తన లారీతో అర్ డీ ఓ కారును ఢీ కొట్టాడు.సంఘటనా స్థలంలో నలుగురు అధికారులు చనిపోయారు.డ్రైవర్ నేరుగా సమీప పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.!

* కృష్ణాజిల్లా గుడివాడ…పెదపారుపూడి మండలంలో నకిలీ విలేఖరిని అదుపులోకి తీసుకున్న మండల పోలీసులు.

* కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ స్పందన కార్యక్రమానికి మారణాయుధాలతో వచ్చిన వ్యక్తి. డమ్మీ గన్ ,చాకు, కారం పొట్లం స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.సదరు వ్యక్తి తిరువూరు మండలం చిట్టెల గ్రామానికి చెందిన కొల్లి.అశోక్ గా గుర్తింపు.

* సుమారు 50 లక్షలు విలువైన 800 ఖ్ఘ్స్ గంజాయి స్వాధీనం చేసుకున్న ఏలూరు రూరల్ పోలీసులు

* విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఎ వద్ద సి హెచ్ డబ్ల్యు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు గత 22 నెలలుగా ప్రభుత్వం చెల్లించాల్సిన జీతాల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సి హెచ్ డబ్ల్యూ లను ఆశలు గా గుర్తించి, పని భారాన్ని తగ్గించి, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను తమకు వర్తింప చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎపిఓ కు వినతిపత్రం అందజేశారు.

* అనంతపురం జిల్లా కదిరి పట్టణం చౌక్ ప్రాంతంలో బంగారు పనిచేసుకునే కరణ్ 23 అనే యువకుడు దారుణ హత్య..మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చి కదిరిలో బంగారం గళ్ళలో పని చేసుకుంటూ జీవించేవాడు..