Politics

నేను మోడీని కాను-వయనాడ్‌లో రాహుల్ పూజలు

rahul gandhi puja in kerala vayanad election campaign

నేను మోదీలా కాదు.. ఆయనలాగా అబద్ధాలు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. వయనాడ్‌లో రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. వయనాడ్‌ నుంచి తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్న ప్రజలందరికి ధన్యవాదాలు చెప్పారు. ఇక్కడి ప్రజలతో జీవితాంతం మంచి సంబంధాలను నెలకొల్పుకునేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఒక కుమారుడిగా, సోదరుడిగా ఇక్కడి ప్రజలు తనను ట్రీట్‌ చేయాలని కోరారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ. 15 లక్షలు జమ చేస్తానని తాను మోదీలా అబద్ధాలు చెప్పను అని రాహుల్‌ స్పష్టం చేశారు. మోదీ దేశానికి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఈ ప్రచారం కంటే ముందు రాహుల్‌ తిరునెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు చేసిన అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.