Sports

టీమిండియా సరికొత్త జెర్సీలు వచ్చేశాయి

Team India New Sports Jersey Are Here

ప్రపంచకప్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం ఇంగ్లాండ్‌ X భారత్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో కోహ్లీసేన కొత్త జెర్సీలను ధరించనుంది. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లూ నీలిరంగు జెర్సీలను ధరిస్తూ ఆడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ రెండు జట్లు తలపడే మ్యాచ్‌లో టీమిండియా జెర్సీలు మారాయి. టీమిండియా కొత్త జెర్సీలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. కొత్తగా ఆ జెర్సీలను ధరిస్తూ కోహ్లీసేన తాజాగా ఫొటోలకు ఫోజులిచ్చింది. రేపు జరగబోయే మ్యాచ్‌లో ఎలా కనిపిస్తారో తెలియజేస్తూ క్రికెట్‌ ప్రపంచకప్‌ ట్విటర్‌లో ఈ ఫొటోలను షేర్‌ చేసింది. ఇందులో ముదురు నీలం రంగుతో పాటు నారింజ రంగు కూడా జోడించారు. దీంతో ఈ ఫొటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.